ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న స్టార్ హీరోయిన్…. మరెవరో కాదు?

నిమిషానికి కోటి తీసుకుంటున్న హీరోయిన్ ?ఆమె ఎవరు అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నట్లు సమంత, నయనతార, ప్రియాంక, దీపిక…… వీళ్ళు ఎవరుకాదు!

హీరోలతో సమానమైన పారితోషకం మాకు ఎక్కడిది అని పెదవిర్చే హీరోయిన్లు చాలామంది ఉన్నారు. నిజమే అయితే హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ అందుకునే వాళ్లూ చాలా అరుదుగా ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం హీరోయిన్లు తీసుకున్నంత పారితోషకాన్ని హీరోలు కూడా అందుకోలేరు. అవును సినిమా మొత్తానికి ఓ సాధారణ హీరో రెండు కోట్లు తీసుకున్న అందులో ఐటమ్ సాంగ్ చేసిన హీరోయిన్ కు అంతకన్నా ఎక్కువ ముట్ట చెబుతారు. ‘నిర్మాతలు’ వారు అడిగినంత ఇచ్చేందుకు కూడా వెనకాడరు.

ఐటమ్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్గా మారిపోయిన ‘ఊర్వశిరౌతేలా ‘కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. బాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉన్న ఈమె “వాల్తేరు వీరయ్య” సినిమాలో ఐటమ్ సాంగ్ “బాస్ పార్టీ”లో తలుక్కుమని మెరిసింది. ఈ చిత్రానికి గాను ఆమెకు రెండు కోట్లు ముట్టాయట. ఈ మూవీ, ఆ పాట రెండు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడంతో ఈ బ్యూటీకి మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఆ తర్వాత ఏజెంట్ లో ‘వైల్డ్ సాలా’ పాటలో తన అందచందాలను ,ఒంపు సొంపులను ప్రదర్శించింది.

అలాగే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లా ‘బ్రో’ సినిమాలోని “మై డియర్ మార్కండేయ” అంటూ స్పెషల్ సాంగ్లో స్టెప్పులేసింది. ఎనజిటిక్ హీరో ‘రామ్ పోతినేని’ “స్కంద” సినిమాలో కూడా ఓ పాటలో మెరుపుతీగ లాగా వచ్చిపోనుంది. అయితే ఈ చిత్రంలో మూడు నిమిషాల పాటకు గాను మూడు కోట్లు డిమాండ్ చేసిందంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ లెక్కన ఆమె నిమిషానికి కోటి రూపాయలు తీసుకో నుందన్నమాట! ఎంతవరకు నిజమో తెలియదు గాని కాలం కలిసి వచ్చేటప్పుడే కోట్లు కూడబెట్టుకోవాలి !అనే ఫార్ములాను ఊర్వశీ గట్టిగానే ఫాలో అవుతుందంటున్నారు. అభిమానులు ,సినీ పెద్దలు……..

Leave a Reply

Write your Review on this Movie