‘మహా భారతం’ రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ పై అప్డేట్ వచ్చేసింది. విజయేంద్రప్రసాద్ కీలక వ్యాఖ్యలు…

రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంపై ఆయన తండ్రివిజయేంద్రప్రసాద్ కీలక కామెంట్స్ చేశారు.

రాజమౌళి డ్రీం ప్రాజెక్టు పై ఆయన తండ్రి మరియు ప్రముఖ రచయిత అయిన ‘విజయేంద్ర ప్రసాద్’ గారు కీలక కామెంట్స్ చేశారు. రాజమౌళి “మహాభారత “ఇతిహాసం ఆధారంగా సినిమా తీయడం తన “డ్రీమ్ ప్రాజెక్ట్” అని ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో స్పష్టం చేశారు. అయితే ఇదే అంశంపై తాజాగా మాట్లాడిన విజయేంద్ర ప్రసాద్ మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ ఒక అడ్వెంచర్ మూవీ అన్నారు. భారీ స్థాయిలో ఈ మూవీకి ప్లాన్ చేస్తున్నామన్నారు. “RRR”కు మించి ఈ సినిమా ఉంటుందన్నారు . ఎన్టీఆర్- రామ్ చరణ్ కాంబోలో “RRR” 2 సీక్వెల్ కు ప్లాన్ చేస్తున్నామన్నారు .ఈ సినిమాకు రాజమౌళి డైరెక్షన్ చేస్తారా లేక వేరే హాలీవుడ్ డైరెక్టర్ పనిచేస్తారా అనేది ఇప్పుడే చెప్పలేను అన్నారు.

మహేష్ బాబుతో రాజమౌళి సినిమా అయ్యాక రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ”మహాభారతం “స్టార్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు ‌. ఈ మహాభారత ఇతిహాసంను ‘నా భూతో నా భవిష్యత్తు’ అనే విధంగా తీర్చిదిద్దగల డైరెక్టర్ రాజమౌళి గారు అని అంతటి సత్తా రాజమౌళికి మాత్రమే సాధ్యం అని, భారతీయ కథలను ప్రపంచానికి చెప్పాలని. విజయేంద్ర ప్రసాద్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మహాభారతం’ సినిమా తీస్తే 10 భాగాలుగా పట్టొచ్చు అని కూడా అన్నారు .

Leave a Reply

Write your Review on this Movie