మహేష్ బాబు నమ్రత మధ్య గొడవ… కారణం అదే అంటున్న నమ్రత.

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ టాలీవుడ్ పరిశ్రమలో స్టార్ కపుల్స్ గా పేరు సంపాదించుకున్నారు. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన “వంశీ” అనే చిత్రంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. దాదాపు నాలుగేళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించి అనంతరం పెద్దల సమక్షంలో 2005 ఫిబ్రవరి 10న వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు పూర్తిగా స్వస్తి పలికారు. ఇక సెలబ్రిటీల జీవితాల్లో ఉండే ఎన్నో చిక్కులు, చికాకులు, విడాకులు, వరకు పోతున్న జంటల్ని ఎందరినో చూస్తున్నాం. కానీ వీరి పెళ్ళై దాదాపు 18 ఏళ్లయిన ఇప్పటివరకు వీరి మధ్య ఎలాంటి గొడవలు లేకుండా సుఖ సంతోషాలతో జీవితాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నారు వీరికి గౌతమ్ సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అయితే నమ్రత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. తను వెయిట్ తక్కువగా ఉండటం వల్ల గౌతం కడుపులో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడిందట.ఆ సమయంలో నమ్రత మరింత డిప్రెషన్కు కు లోనయ్యి పదే పదే ఏడుస్తూ ఉండేదట, మహేష్ బాబు ఎంత చెప్పినా ఆ మూడ్ నుంచి అస్సలు బయటకు వచ్చేది కాదని…… నమ్రత మనసు మార్చడానికి లాగిపెట్టి ఒక్కడిచ్చారట, అది కూడా డాక్టర్ చెప్తేనే కొట్టారట, ఆమె నార్మల్ మూడులోకి వచ్చిందట. ప్రెగ్నెన్సీ టైంలో నమ్రత పడిన ఇబ్బందుల గురించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Leave a Reply

Write your Review on this Movie